యాప్నగరం

నక్కబొక్కలపాడు: మహిళా కూలీల ప్రాణాలు బలి తీసుకున్న గోడ

జాకీల సాయంతో నిర్మాణంలో ఉన్న గోడ ఎత్తు పెంచే ప్రయత్నం. వర్షానికి కుప్పకూలిన గోడ. నిరుపేద కూలీలు దుర్మరణం.

Samayam Telugu 26 Sep 2018, 10:05 pm
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో విషాదం చోటుచేసుకుంది. నక్కబొక్కలపాడు రవి గ్రానైట్ పాలిషింగ్ కంపెనీ యూనిట్‌లో గోడ కూలిన ఘటనలో ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 12 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకి తీసుకొచ్చి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu Prakasam


నక్కబొక్కలపాడులో గ్రానైట్ పాలిషింగ్ యూనిట్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా దీనికి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే.. గోడలు పూర్తైన తర్వాత భూమిలో వాటి ఎత్తు కాస్త పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. జాకీలు అమర్చి గోడలను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో బుధవారం (సెప్టెంబర్ 26) సాయంత్రం బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో నిర్మాణంలో ఉన్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంత ఇద్దరు కూలీలు బలయ్యారు. పలు ప్రాంతాల్లో ఇళ్ల ఎత్తు పెంచే ఘటనలు ఇటీవల అధికమయ్యాయి. అయితే నిపుణులైన వ్యక్తుల పర్యవేక్షణలో ఇవి జరుగుతున్నాయి. కానీ, తాజాగా ప్రమాదం జరిగిన గ్రానైట్ కంపెనీలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే ఈ పనులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.