యాప్నగరం

నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తాం: ఉత్తమ్

2019లో తాము అధికారంలోకి వస్తామని, అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రూ. 3వేల జీవనభృతి కల్పిస్తామని

Samayam Telugu 14 May 2017, 10:58 am
2019లో తాము అధికారంలోకి వస్తామని, అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రూ. 3వేల జీవనభృతి కల్పిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాదు రైతులకు రూ.2 లక్షల మేరకు రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. అటు ప్రస్తుతం ప్రభుత్వం
Samayam Telugu unemployed will be paid rs 3k if congress come to power uttam kumar reddy
నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తాం: ఉత్తమ్

వృద్ధులు, వికలాంగులకు అందించే పెన్షన్లను పెంచుతామని చెప్పారు.

మిర్చికి మద్దతు ధర కల్పించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆమరణ దీక్ష చేస్తున్న మాజీ ఛీప్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి దీక్షా శిబిరాన్ని ఉత్తమ్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించారు. సిఎం కెసిఆర్‌కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ ఖరీఫ్ నుండే ఎకరానికి రూ.4వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.