యాప్నగరం

నిరుద్యోగ భృతిపై త్వరలో ప్రకటన?

నిరుద్యోగ భృతిపై పది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందుతుందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యానారాయణ పేర్కొన్నారు.

TNN 20 Aug 2017, 4:41 pm
నిరుద్యోగ భృతిపై పది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పితాని సత్యానారాయణ పేర్కొన్నారు. గుంటూరు హిందూ కళాశాలలో కౌండిన్య సేవా సమితి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ విజయరావును సన్మానించారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని, ఈ విషయమై మంత్రి వర్గ ఉప సంఘం చర్చిస్తోందని ఆయన అన్నారు. నిరుద్యోగ భృతిని నగదుగా ఇవ్వాలా? లేక నైపుణ్యాభివృద్ధి రూపంలో ఇవ్వాలా?, వయసు, విద్యార్హత తదితర అంశాలపైన చర్చ జరుగుతోందని, ఈ హామీని రూ.500 కోట్ల నిధి ఏర్పాటుతో తప్పక నెరవేరుస్తామని మరోమారు మంత్రి సత్యన్నారాయణ స్పష్టం చేశారు.
Samayam Telugu unemployment benfits will shortly announce in andhra pradesh
నిరుద్యోగ భృతిపై త్వరలో ప్రకటన?


ఉపాధి కల్పనా కార్యాలయాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కార్యాలయాలను త్వరలో ఆధునికీకరించి, పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. ఇందుకోసం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తామని, ఏపీపీఎస్సీతో ఈ శాఖను అనుసంధానం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలనూ యువతకు చేరువ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల సందర్భరంగా విడుదల చేసిన మ్యానిఫేస్టోలో నిరుద్యోగ భృతి కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయినా దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆందిన తర్వాతే తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.