ప్రేమలో మోసపోవడంతో ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాకు చెందిన గీతాకృష్ణ అనే యువతి చైతన్యపురిలో డెంటిస్ట్ (దంత వైద్యురాలి)గా పని చేస్తోంది. స్థానికంగా ఓ లేడీస్ హాస్టల్ ఉంటోంది. మంగళవారం (డిసెంబర్ 5) ఆమె హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని తనువు చాలించింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె తన సోదరికి ఫోన్ చేసి మాట్లాడింది. నరేశ్ అనే యువకుడు తనను ప్రేమ పేరుతో వంచించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె తన సోదరితో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రేమలో మోసపోయి మానసికంగా కుంగిపోవడం వల్లే గీతాకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె సోదరి పోలీసులకు తెలిపింది.
సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్కు చేరుకుని గీతాకృష్ణ మృతదేహాన్ని కిందికి దించారు. కేసు నమోదు చేసుకొని, ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్కు చేరుకుని గీతాకృష్ణ మృతదేహాన్ని కిందికి దించారు. కేసు నమోదు చేసుకొని, ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.