యాప్నగరం

రెండో భార్యపై అనుమానం.. మొదటి భార్య, కూతురు హత్య!

రెండో భార్య ఎవరితోనే వెళ్లిపోయిందనే మనస్థాపంతో ఓ భర్త.. మొదటి భార్యను, కూతురిని హత్యచేసి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

Samayam Telugu 25 Nov 2018, 10:59 pm
న రెండో భార్య ఎవరితోనే వెళ్లిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి రెండో భార్యను, ఎనిమిదేళ్ల కూతురిని హత్యచేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆదిబాట్లలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న హనుమంతు(30)కు చంద్రకళ (28), సుజాత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.
Samayam Telugu embed_1512044933_725x725


మొదటి భార్య చంద్రకళకు ముగ్గురు పిల్లలు, రెండో భార్య సుజాతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, సుజాత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. అయితే, ఆమె ఎవరితోనో వెళ్లిపోయిందనే అనుమానంతో హనుమంతు మానసికంగా కుంగిపోయాడు. దీంతో శుక్రవారం రాత్రి భార్య, కూతురిని ఊరి వేసి హత్య చేశాడు. అనంతరం అతను కూడా ఉరి వేసుకున్నాడు. అయితే, మంచంపై నిద్రపోతున్న మిగతా ఇద్దరి పిల్లలకు మాత్రం ప్రాణాలతో వదిలేశారు. ఘటన స్థలంలో లభించిన సుసైడ్ నోట్‌లో తన రెండో భార్య ఇద్దరు పిల్లలతోపాటు కనిపించకుండా పోవడానికి సాయి, వెంకటేశ్, కిటులే కారణమని రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.