యాప్నగరం

ఉత్తమ్‌ను మార్చే ప్రసక్తే లేదు: కుంతియా

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవినుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొలగించే ప్రసక్తే లేదని తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కుంతియా శనివారం (జూన్ 23) స్పష్టం చేశారు.

Samayam Telugu 23 Jun 2018, 10:01 pm
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొలగించే ప్రసక్తే లేదని తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కుంతియా శనివారం (జూన్ 23) స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కుంతియా తెలిపారు. శనివారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కుంతియా.. ఉత్తమ్‌ నేతృత్వంలో ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నామని తేల్చి చెప్పారు. అంతర్గత విభేదాలుంటే అధిష్టానానికి చెప్పుకోవచ్చని, రాహుల్‌కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదన్నారు. కానీ మీడియా ముందు ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ శ్రేణులను హెచ్చరించారు.
Samayam Telugu uttam


ఇదే సమయంలో పార్టీని వీడుతున్నవారిపై స్పందించిన కుంతియా.. పార్టీని వీడే వారిని ఎవరూ ఆపలేరని అన్నారు. 2014తో పోలిస్తే తమ పార్టీ ఓటు బ్యాంకు 10 శాతం పెరిగిందన్నారు. తాజా సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు. కొత్తగా నియమించిన ముగ్గురు కార్యదర్శులకు... 40 నియోజకవర్గాల చొప్పున పని విభజన చేశామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.