యాప్నగరం

పాఠ్యాంశంగా వనజీవి రామయ్య జీవితం

మొక్కల ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్యకు మరో అరుదైన గుర్తింపు లభించింది.

TNN 11 May 2017, 5:32 pm
మొక్కల ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్యకు మరో అరుదైన గుర్తింపు లభించింది. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టనుంది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా రానుంది.
Samayam Telugu vanajeevi ramaiah biography to be a lesson in maharashtra school books
పాఠ్యాంశంగా వనజీవి రామయ్య జీవితం


రామయ్య చిన్నతనంలో మొక్కలు నాటేందుకు దోహదపడిన అంశాలు.. ఇప్పటి వరకు ఆయన ఎన్ని మొక్కలు నాటారు, కుటుంబ విశేషాలతో పాఠ్యాంశం ఉండనుందట. అంతేకాకుండా రామయ్య సమాజానికి, ప్రజలకు మొక్కలు నాటడం ద్వారా చేసిన సేవలను పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు వివరించనున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ అధికారి రామయ్యకు ఫోన్ చేసి ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పినట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.