ఇవాళ సాయంత్రం విజయవాడలోని మొగల్రాజపురంలో వంగవీటి రాధా, రత్నకుమారిలని వారి నివాసం వద్దే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్కి తరలించిన సంగతి తెలిసిందే. వంగవీటి రాధా, రత్నకుమారిల అరెస్టుతో రగిలిపోయిన వంగవీటి రంగ అనుచరులు భారీ సంఖ్యలో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ వద్దకి చేరుకుని పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదల ఆశాజ్యోతి, దివంగత నాయకుడు వంగవీటి మోహన రంగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌతం రెడ్డిని ఏమీ అనని పోలీసులు తమ నాయకుడిని మాత్రం అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లో నేలపై కూర్చోబెట్టారని వంగవీటి అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమాచారం అందుకున్న మల్లాది విష్ణు, జోగి రమేష్ వంటి నేతలు కూడా వంగవీటికి మద్దతుగా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్కి చేరుకున్నారు.
ఇదిలావుంటే, స్టేషన్లో నేలపైనే కూర్చుని పోలీసుల వైఖరిపై తమ నిరసన వ్యక్తంచేసిన వంగవీటి రాధా, రత్నకుమారిలు స్టేషన్లోనూ పోలీసులతో వాగ్వీవాదానికి దిగినట్టు తెలుస్తోంది. మరోవైపు స్టేషన్ బయట నిరసనకి దిగిన వంగవీటి అనుచరులు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసు స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్యే రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పోలీసులు వంగవీటి రాధా, రత్నకుమారిలని విడుదల చేశారు.
స్టేషన్ నుంచి బయటికొచ్చిన వంగవీటి రాధా, రత్నకుమారిలు తమ అనుచరులు, అభిమానులకి అభివాదం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన డీసీపీ క్రాంతి రానా సిటీలో శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వంగవీటి రాధా, వంగవీటి రత్నకుమారిని అదుపులోకి తీసుకున్నట్టు మీడియాకు తెలిపారు.
ఇదిలావుంటే, స్టేషన్లో నేలపైనే కూర్చుని పోలీసుల వైఖరిపై తమ నిరసన వ్యక్తంచేసిన వంగవీటి రాధా, రత్నకుమారిలు స్టేషన్లోనూ పోలీసులతో వాగ్వీవాదానికి దిగినట్టు తెలుస్తోంది. మరోవైపు స్టేషన్ బయట నిరసనకి దిగిన వంగవీటి అనుచరులు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసు స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్యే రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పోలీసులు వంగవీటి రాధా, రత్నకుమారిలని విడుదల చేశారు.
స్టేషన్ నుంచి బయటికొచ్చిన వంగవీటి రాధా, రత్నకుమారిలు తమ అనుచరులు, అభిమానులకి అభివాదం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన డీసీపీ క్రాంతి రానా సిటీలో శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వంగవీటి రాధా, వంగవీటి రత్నకుమారిని అదుపులోకి తీసుకున్నట్టు మీడియాకు తెలిపారు.