యాప్నగరం

ఆ ఎంపీ జగన్ ఏజెంట్: టీడీపీ నేత ఫైర్

ఎంపీ సీఎం రమేశ్ టీడీపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నియమించిన ఏజెంట్ అని అంటూ మండిపడ్డారు

Samayam Telugu 10 Jun 2018, 9:45 am
ఎంపీ సీఎం రమేశ్ టీడీపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నియమించిన ఏజెంట్ అని అంటూ మండిపడ్డారు వైఎస్సార్ కడప జిల్లా సీనియర్ నేత, ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జి వరదరాజులు రెడ్డి. ఎంపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, తీవ్ర విమర్శలు చేశారు వరదరాజులు రెడ్డి. సీఎం రమేశ్ అనునిత్యం ఒక ప్రత్యేక విమానంలో తిరుగుతూ ఉన్నారని, ఆయనకు ఆ విమానం ఎలా వచ్చిందని ఈ టీడీపీ నేత తన సాటి టీడీపీ నేతను ప్రశ్నించారు.
Samayam Telugu tdp


సీఎం రమేశ్ పంచాయితీకి ఎక్కువ, మండలానికి తక్కువ అని మండి పడ్డారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేంత సత్తా రమేశ్‌కు లేదని అన్నారు. ఆయన తీవ్రంగా అవినీతికి పాల్పడుతున్నారని, చంద్రబాబు దయతో రాజ్యసభ సభ్యుడయ్యారని అన్నారు.

గత మూడేళ్లలోనే సీఎం రమేశ్ ఏకంగా రూ.3,500 కోట్ల రూపాయలను సంపాదించుకున్నారని అన్నారు. ప్రభుత్వం ద్వారా ఈ సొమ్మును సంపాదించుకున్నారని.. ఇంకా నకిలీ ఖాతాలతో బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల అప్పులను తీసుకున్నారని అన్నారు. కడప జిల్లాలో సీఎం రమేశ్ వల్ల తెలుగుదేశం పార్టీ ఒక్క నియోజకవర్గంలో కూడా గెలిచే పరిస్థితుల్లో లేదని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.