యాప్నగరం

వైఎస్సార్సీపీలోకి చేరిన టీడీపీ నేత

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన టీడీపీ నేత వసంత నాగేశ్వరరావు,

Samayam Telugu 10 May 2018, 1:13 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన టీడీపీ నేత వసంత నాగేశ్వరరావు, ఆయన తనయుడు వసంత కృష్ణప్రసాద్. వీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాదయాత్రలో ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో వీరు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేయించుకున్నారు. వారితో పాటు మరికొంత మంది కార్యకర్తలు కూడా వైఎస్సార్సీపీలోకి చేరారు.
Samayam Telugu jagan_krishna


ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చాలా ఉపయోపడుతున్నాయని అన్నారు.

జగన్ పాదయాత్ర ఆరంభంలో పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. పాదయాత్ర ప్రారంభ సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అయితే ప్రజాసంకల్పయాత్ర కోస్తాంధ్ర జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి జగన్ పార్టీలోకి నేతల వలసలు సాగుతుండటం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.