రైతుల సంబరాలు.. తాత్కాలికమే అన్న మంత్రి హరీశ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
TNN 6 Oct 2017, 9:13 am
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కాళేశ్వరం పనులను తక్షణమే నిలుపుదల చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్టే ఇవ్వడంతో సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని వేములఘాట్ గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. సుమారు 50 మంది రైతులు ఒక దగ్గరకు చేరుకుని టపాసులు కాల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంతో తమకు న్యాయం చేయాలని వేములఘాట్ గ్రామ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంగా పోరాడుతున్నారు. భూ సేకరణ చట్టాన్ని అమలుచేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై స్టే రావడంతో వీరంతా సంబరాలు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్టే తాత్కాలిక అడ్డంకి మాత్రమేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం సాధిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం ఆయన నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్జీటీ స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ పైశాచిక ఆనందం పెందుతోందని విమర్శించారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తున్న దశలో కాంగ్రెస్ కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. కుళ్లు రాజకీయాలతో కాంగ్రెస్ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు.
కాగా, అనుమతులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారంటూ హయతుద్దీన్ అనేవ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జావేద్ రహింతో కూడిన ధర్మాసనం వరసగా మూడోరోజు గురువారం విచారణ చేపట్టింది. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని, చెట్లు నరకొద్దని, పేలుళ్లు జరపొద్దని ట్రిబ్యునల్ స్టే విధించింది. ప్రాజెక్టుకు అనుమతులన్నీ వచ్చాకా ప్రభుత్వం మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించొచ్చని అని మధ్యంతర ఉత్తర్వుల్లో ధర్మాసనం పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులను మూడురోజులపాటు నిలిపి ఉంచాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది.
ఇదిలా ఉంటే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్టే తాత్కాలిక అడ్డంకి మాత్రమేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం సాధిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం ఆయన నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్జీటీ స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ పైశాచిక ఆనందం పెందుతోందని విమర్శించారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తున్న దశలో కాంగ్రెస్ కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. కుళ్లు రాజకీయాలతో కాంగ్రెస్ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు.
కాగా, అనుమతులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారంటూ హయతుద్దీన్ అనేవ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జావేద్ రహింతో కూడిన ధర్మాసనం వరసగా మూడోరోజు గురువారం విచారణ చేపట్టింది. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని, చెట్లు నరకొద్దని, పేలుళ్లు జరపొద్దని ట్రిబ్యునల్ స్టే విధించింది. ప్రాజెక్టుకు అనుమతులన్నీ వచ్చాకా ప్రభుత్వం మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించొచ్చని అని మధ్యంతర ఉత్తర్వుల్లో ధర్మాసనం పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులను మూడురోజులపాటు నిలిపి ఉంచాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది.