యాప్నగరం

చవటపాలెంలో వెంకయ్యకు ఘన సన్మానం

ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన ఎం. వెంకయ్యనాయుడు మంగళవారం తన స్వగ్రామమైన నెల్లూరు జిల్లాలోని చవటపాలెంలో పర్యటించారు.

TNN 8 Aug 2017, 4:56 pm
ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన ఎం. వెంకయ్యనాయుడు మంగళవారం తన స్వగ్రామమైన నెల్లూరు జిల్లాలోని చవటపాలెంలో పర్యటించారు. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా చవటపాలెం గ్రామస్థులు ఆయనకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కన్నతల్లిని, మాతృదేశాన్ని మరిచినవాడు మనిషేకాదని అన్నారు. కులాలు, మతాలు మనం సృష్టించుకున్నవే అని తెలిపారు. చవటపాలెం గ్రామానికి రైల్వేలైన్‌తో పాటు పలు అభివృద్ధి పనులు మంజూరు చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Samayam Telugu venkaiah naidu visits his native village chavatapalem
చవటపాలెంలో వెంకయ్యకు ఘన సన్మానం


ఆత్మీయ అభినందన సభలో తమ సొంతూరులోని ఆత్మీయులను పేరుపేరున పలకరించిన వెంకయ్య అనంతరం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా, సోమవారం సాయంత్రం నెల్లూరు చేరుకున్న వెంకయ్య నాయుడికి ఘనస్వాగతం లభించింది. తిరుమల నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న వెంకయ్యకు మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ ముత్యాలరాజు, ఎస్పీ రామకృష్ణలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

అక్కడి నుంచి ఆత్మీయ సభ జరిగిన వీఆర్‌పీ గ్రౌండ్ వరకు భారీ ప్రదర్శనగా వెళ్లారు. ఈ సమయంలో దారి పొడవునా విద్యార్థులు, ప్రజలు వెంకయ్యకు ఘనస్వాగతం పలికారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. వీఆర్‌పీ గ్రౌండ్‌లో జరిగిన ఆత్మీయ సభలో వెంకయ్యను ఘనంగా సన్మానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.