యాప్నగరం

వైఎస్ జగన్‌పై సెటైర్లేసిన వేణు మాధవ్

నంద్యాల ఉప ఎన్నికల కోసం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నంద్యాల నియోజకవర్గంలో...

TNN 12 Aug 2017, 10:48 pm
నంద్యాల ఉప ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి రావాల్సిన పనిలేకుండా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగనే సీఎం తరపున ప్రచారం చేస్తున్నారు అని అన్నారు సినీనటుడు వేణు మాధవ్. టీడీపీ పార్టీకే చెందిన వేణు మాధవ్ శనివారం టీడీపీ నేత, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌తో కలిసి నంద్యాలలో జరిగిన ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వేణు మాధవ్.. 'నిత్యం వైఎస్ జగన్ పదేపదే చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావిస్తూ తనకి తెలియకుండానే చంద్రబాబు తరపున ప్రచారం చేస్తున్నారు' అని ఎద్దేవా చేశారు. జగన్ టీడీపీ తరపున అంతగా ప్రచారం చేస్తున్నప్పుడు ఇక సీఎం చంద్రబాబుకి ఎన్నికల ప్రచారానికి రావాల్సిన అవసరం ఏముంటుంది అని ప్రశ్నించారు ఈ కమెడియన్.
Samayam Telugu venu madhav satires on ys jagan in nandyal bypoll
వైఎస్ జగన్‌పై సెటైర్లేసిన వేణు మాధవ్


టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకే ఇక్కడికి వచ్చారా అనే ప్రశ్నకి స్పందిస్తూ.. 'తాను ప్రచారం కోసం నంద్యాల రాలేదని, టీడీపీ తరపున పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానంద రెడ్డికి ఎంత మెజార్టీ వస్తుందో ఓసారి చూద్దామనే ఉద్దేశంతోనే వచ్చాను' అని అన్నారు వేణుమాధవ్. అయితే, టీడీపీ నుంచి వస్తున్న ప్రతీ కౌంటర్‌కి సాధ్యమైనంత స్ట్రాంగ్‌గా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తోన్న వైఎస్సార్సీపీ నేతలు వేణు మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంటారా లేక అంతకన్నా గట్టిగానే సమాధానం ఇస్తారా అనేది వేచిచూడాల్సిందే మరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.