యాప్నగరం

పార్టీలను టెన్షన్ పెడుతున్న నంద్యాల ఓటర్!

నంద్యాల గత చరిత్రకు భిన్నంగా సాగుతున్న పోలింగ్..

TNN 23 Aug 2017, 11:18 am
​ కనీసం 80 శాతం పోలింగ్ ఖాయం.. అని అంటున్నారు విశ్లేషకులు. పోలింగ్ ప్రారంభం అయిన తొలి గంటల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే.. సాయంత్రానికి నంద్యాల ఉప ఎన్నికలో 80 శాతం పోలింగ్ నమోదు కావడం ఖాయమనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఎనభై శాతం పోలింగ్ ఇతర నియోజకవర్గాలకు పెద్ద వింత కాదేమో కానీ, నంద్యాలకు పెద్ద వింత.
Samayam Telugu very huge turnout in nandyal by poll
పార్టీలను టెన్షన్ పెడుతున్న నంద్యాల ఓటర్!


గత కొన్ని పర్యాయాలుగా ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో నమోదైన పోలింగ్ శాతాన్ని గమనిస్తే.. 2004 ఎన్నికల్లో దాదాపు 65 శాతం పోలింగ్ నమోదైంది. 2009లో దాదాపు 69 శాతం పోలింగ్ నమోదైంది. అదే 2014 విషయానికి వస్తే 62 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇలా కనీసం డెబ్బై శాతం పోలింగ్ కూడా నమోదు కానీ నియోజకవర్గంలో ఒక్కసారిగా 80 శాతం పోలింగ్ నమోదు అంటే.. అది అత్యంత ఆసక్తిదాయకమైన విషయమే.

భారీ పోలింగ్ శాతం ప్రజల్లో ఎన్నిక పట్ల ఉత్సాహాన్ని తెలియ జేస్తోంది. అంతే కాదు.. పార్టీలను ఇది అమితంగా టెన్షన్ పెడుతోంది. భారీ స్థాయిలో నమోదవుతున్న పోలింగ్ శాతం.. ఎవరికి ఇబ్బందిగా మారుతుంది? ఎవరికి మేలును చేస్తుంది.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. ఇదే అంశం ఇప్పుడు అంతటా చర్చగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల ఉప ఎన్నిక పట్ల అమితాసక్తి నెలకొని ఉంది. ఎవరు గెలుస్తారనే అంశంపై భారీగా బెట్టింగులు కూడా జరిగాయి. ఇక రాష్ట్ర రాజకీయ స్థితి కూడా నంద్యాల ఫలితం ఒక దిక్సూచి అనే అభిప్రాయం ఉంది.

ఇన్ని పరిణామాలను నిర్దేశించబోతున్న నంద్యాల ఓటర్.. ఓటింగ్ లో బిజీగా ఉన్నాడు. తన తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేసేసి బాధ్యతను పూర్తి చేస్తున్నాడు. పార్టీలను టెన్షన్లో పడేస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.