యాప్నగరం

సామాన్య భక్తుల మాదిరిగా శ్రీవారి ఆలయంలోకి వెంకయ్య!

మహాద్వారం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే అర్హత ఉన్నప్పటికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సామాన్య భక్తులు వెళ్లే క్యూలైన్‌లో నిలబడ్డారు.

TNN 11 Jan 2018, 3:26 pm
తిరుమలలోని శ్రీవారిని ఉపరాష్ట్రపతి హోదాలో తొలిసారిగా వెంకయ్యనాయడు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా గురువారం ఉదయం ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణకి చేరుకుని పవిత్ర జలాలను ప్రోక్షణం చేసుకున్నారు. అనంతంర శ్రీవరాహస్వామివారి దర్శించుకుని వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. సామాన్య భక్తులతోపాటు క్యూలైన్‌లో స్వామివారి ఆలయానికి వచ్చిన వెంకయ్య, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అధికారుల ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం అద్దాల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తర్వాత టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఏఈఓ శ్రీనివాసరాజులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. వెంకయ్య నాయుడి వెంట ఏపీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న కూడా ఉన్నారు.
Samayam Telugu vice president m venkaiah naidu visited tirumala
సామాన్య భక్తుల మాదిరిగా శ్రీవారి ఆలయంలోకి వెంకయ్య!


దర్శనం అనంతరం బయటకు వచ్చిన వెంకయ్య, ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మరింత పట్టుదలతో కర్తవ్య నిర్వహణ చేయాలని భగవంతుడిని ప్రార్థించా... పది మందికి ఉపయోగపడేలా జీవనం సాగాలి... మన చర్యల వల్ల ఇతరులకు నష్టం కలగకూడదు... సర్వ మానవ సౌభ్రాతృత్వానికి ఒకరికొకరు సహకరించుకోవాలి... మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో నవ్యక్రాంతిని తీసుకురావాలి... మరింత శక్తిమంతమైన దేశంగా భారత్ ఎదగాలి... అని ఆయన తెలిపారు. ఉపరాష్ట్రపతికి ఆలయ మహద్వార ప్రవేశం ఉన్నప్పటికీ సామాన్య భక్తులి మాదిరిగా లోనికి ప్రవేశించడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.