యాప్నగరం

YS Jagan: హరికృష్ణ మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వెంకయ్య, జగన్

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూయడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Samayam Telugu 29 Aug 2018, 9:18 am
రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూయడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి చింతిస్తున్నాను. ఎన్టీఆర్ కుమారుడైన ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడ’ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఆయన ముక్కుసూటి మనిషి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తని ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు.
Samayam Telugu hari-krishna2


‘నటుడిగా, నాయకుడిగా తండ్రి పేరు నిలబెట్టేందుకు నందమూరి హరికృష్ణ ప్రయత్నించారు. ఆయన అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన’ని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
హరికృష్ణ మరణ వార్త తెలియగానే షాకయ్యానని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరుకున్నారు. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన హరికృష్ణ మరణంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.