యాప్నగరం

రాజ్యసభలో జైట్లీ ప్రకటన.. వెంకయ్య జోక్యంతో సీన్ మారిందా?

విభజన హామీలు, బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు చేస్తున్న ఆందోళనలకు ముగింపు పలకాలని ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో సూచించారు.

TNN 10 Feb 2018, 8:31 am
విభజన హామీలు, బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు చేస్తున్న ఆందోళనలకు ముగింపు పలకాలని ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటనకు కొంత భిన్నంగా స్పందించినట్లు సమాచారం. దీంతో భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమావేశమై ఏపీ అంశంపై చర్చించుకున్నారు. రాజ్యసభలో జైట్లీ ప్రకటన చేయడానికి ముందే ముసాయిదాకు అమిత్‌షా ఆమోద ముద్ర వేశారు. దుగరాజపట్నం పోర్టు లాభదాయకం కాదని భద్రతా కారణాల రీత్యా మరో ప్రాంతంలో పోర్టుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. మిగతా అంశాల గురించి స్పష్టంగానే ప్రస్తావించారు.
Samayam Telugu vice president venkaiah naidu key role on ap demands
రాజ్యసభలో జైట్లీ ప్రకటన.. వెంకయ్య జోక్యంతో సీన్ మారిందా?


విశాఖ రైల్వేజోన్‌ విషయంలో బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ నిర్ణయం తీసుకోవాలని చర్చలు జరుగుతున్న దశలో అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనకు ముందు దీనికి అమిత్‌షా ఆమోద ముద్ర వేశారు. ఈ విషయంలో ఎదురవుతోన్న చిన్నచిన్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని భాజపా వర్గాలు పేర్కొన్నాయి. లోక్‌సభలో గురువారం అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనలో ఈ విషయాలేవీ వెల్లడించలేదు. ఆర్థికశాఖ పరిధిలోలేని మిగతా విషయాల గురించి అమిత్‌షా ఆమోదం తీసుకోవాలని టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి జైట్లీ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఏపీకి కేంద్రం నుంచి అందజేయాల్సిన సాయంపై రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షాలతో సుదీర్ఘంగా చర్చించారు.

వారిద్దరితో పార్లమెంటులోని తన ఛాంబర్‌లో సుమారు రెండున్నర గంటలపాటు వెంకయ్య సమాలోచనలు జరిపారు. ఈ చర్చల్లో కొద్దిసేపు సుజనాచౌదరి కూడా పాల్గొన్నారు. విభజన చట్టంలోని హామీలు, వాటి అమలు, ఏపీ ప్రభుత్వం అడుగుతోన్న వివిధ అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. హోదా వల్లే వచ్చే నిధుల మొత్తాన్ని ఒకేసారి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రులు సుజనాకు వివరించారు. ఈఏపీ నిధులు కూడా సర్దుబాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.