ఉపరాష్ట్రపతి వెంకయ్య కుటుంబంలో విషాదం
వెంకయ్య సతీమణి ఉషారాణి తల్లి అల్లూరు కౌసల్యమ్మ ఆదివారం (86) కన్నుమూత. చెన్నైలోని నివాసంలో కన్నుమూసిన కౌసల్యమ్మ. ఢిల్లీ నుంచి నెల్లూరు బయల్దేరిన వెంకయ్య.
Samayam Telugu 30 Dec 2018, 5:33 pm
ప్రధానాంశాలు:
- వెంకయ్య సతీమణి ఉషారాణి తల్లి కన్నుమూత
- చెన్నైలో వెంకయ్య కుమార్తె నివాసంలో ఉంటున్న కౌసల్యమ్మ
- ఆదివారం కన్నుమూత.. పార్ధీవ దేహం నెల్లూరుకు తరలింపు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబంలో విషాద ఘటన జరిగింది. వెంకయ్య సతీమణి ఉషారాణి తల్లి అల్లూరు కౌసల్యమ్మ ఆదివారం (86) కన్నుమూశారు. ఆదివారం ఆమె చెన్నైలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. మరణవార్త గురించి తెలుసుకున్న వెంటనే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీ నుంచి హుటా హుటిన నెల్లూరుకు బయలుదేరారు. కౌసల్యమ్మ స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం శ్రీరామాపురం. కాని గత కొంతకాలంగా కౌసల్యమ్మ.. చెన్నైలో వెంకయ్యనాయుడు కుమార్తె దీపావెంకట్ దగ్గర ఉంటున్నారు. కౌసల్యమ్మ మృత దేహాన్ని ప్రత్యేక వాహనంలో నెల్లూరు తరలిస్తున్నారు. కౌసల్యమ్మ పార్ధీవ దేహానికి ఆమె స్వస్థలమైన శ్రీరామాపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందుకే వెంకయ్య నెల్లూరు వెళుతున్నారు.