యాప్నగరం

అటు నివేదన.. ఇటు నగదు, మందు!

ప్రగతి నివేదన సభకు తరలివెళ్లిన ప్రజలకు నగదు, మందు పంచుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.

Samayam Telugu 2 Sep 2018, 10:18 pm
టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ.. కార్యకర్తలతో కిక్కిరిసింది. ర్యాలీలు, డ్యాన్సులతో సభా ప్రాంగణం హోరెత్తింది. అయితే, సభ వెలుపల కొందరు నగదు, మందు నగదు పంచడం చర్చనీయమైంది. ర్యాలీలో బస్సుల్లో తరలివెళ్తున్న కార్యకర్తలు బస్సులో మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samayam Telugu thumb_1280 (1)


ఈ వీడియోలో కొంతమంది నగదు గాల్లోకి విసురుతూ కనిపించారు. దీంతో, టీఆర్‌ఎస్ ఈ సభ కోసం ఎంత భారీగా ఖర్చుచేసి ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. రూ.300 కోట్ల వ్యయంతో ఈ సభను నిర్వహించారంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వీడియోలు వారి ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.