యాప్నగరం

విజయవాడ: ఆ బాలిక చనిపోయింది నిజమే..!

బతికుండగానే బాలిక మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ స్పష్టం చేశారు. సాయిదుర్గను ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లిన కుటుంబసభ్యులకు నిరాశే ఎదురైంది.

TNN 30 Dec 2017, 9:50 pm
బతికుండగానే బాలిక మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ స్పష్టం చేశారు. బాలిక గుండె కొట్టుకుంటోందని స్థానిక వైద్యురాలు చెప్పడంతో.. ఆమెను ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లిన కుటుంబసభ్యులకు నిరాశే ఎదురైంది. సాయిదుర్గ (12) అప్పటికే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. నగరంలోని మూడు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వారికి ఇదేవిధమైన సమాధానం వచ్చింది. మరోవైపు.. ఈ ఘటనపై డీఎమ్ఈని విచారణకు ఆదేశించినట్లు వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.
Samayam Telugu vijayawada dead girl alive case local doctor misleads sai durgas mother
విజయవాడ: ఆ బాలిక చనిపోయింది నిజమే..!


బాలిక మరణించినట్లు ధ్రువీకరించిన తర్వాత బతికిందనడం అవాస్తవమని కొత్త ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. స్థానిక వైద్యురాలి మాటలు విని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారని, సాయిదుర్గ మరణించినట్లు ధ్రువీకరించుకున్న తర్వాత డెత్ సర్టిఫికెట్ జారీ చేశామని ఆయన చెప్పారు.

రాజరాజేశ్వరిపేటకు చెందిన పి. సాయిదుర్గ (12) గత ఆదివారం (డిసెంబర్ 24) అస్వస్థతకు గురైంది. స్థానిక ప్రైవేటు వైద్యుడి సూచన మేరకు బాలికను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిదుర్గ మరణించినట్లు వైద్యులు శుక్రవారం (డిసెంబర్ 29) రాత్రి ధ్రువీకరించారు. రాత్రి 11 గంటల సమయంలో సాయిదుర్గను అంబులెన్స్‌లో ఇంటికి తరలించారు.

శనివారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో సాయిదుర్గ కదిలినట్లు బంధువులకు అనుమానం వచ్చింది. స్థానిక వైద్యురాలు.. బాలిక మరణించలేదని చెప్పడంతో ఆమెను తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రికి పరుగెత్తారు. మూడు ఆసుపత్రుల్లోనూ సంప్రదించగా.. బాలిక అప్పటికే మరణించిందని వైద్యులు తేల్చి చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.