యాప్నగరం

బాబుకు ప్రివిలైజ్ నోటీసులిస్తాం: విజయసాయిరెడ్డి

ప్రధానమంత్రి కార్యాలయం నేరస్తుల అడ్డాగా మారిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

Samayam Telugu 23 Mar 2018, 3:01 pm
ప్రధానమంత్రి కార్యాలయం నేరస్తుల అడ్డాగా మారిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. తను ప్రధాని కార్యాలయంలోకి వెళ్లడంపై చంద్రబాబు అనుచితంగా మాట్లాడారని.. ధ్వజమెత్తారు విజయసాయి. ఆ మాటలతో చంద్రబాబు నాయుడు పీఎంవోను కించపరిచారని. ఈ విషయంలో ఆయనకు ప్రివిలైజ్ నోటీసులు ఇస్తామని ఆయన ప్రకటించారు.
Samayam Telugu vijayasaireddy.


ఎంపీలు ప్రజా సమస్యల గురించి తెలిపేందుకు పీఎంవోకు వెళ్లడం తప్పు కాదని, అయితే చంద్రబాబు మాత్రం అనుచితంగా మాట్లాడుతున్నారన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా పీఎంవోపై విమర్శలు చేస్తున్నారని.. ఈ మాటలను వింటూ ఊరికే ఉండమని, బాబుకు నోటీసులు ఇస్తాయని సాయిరెడ్డి ప్రకటించారు.

అలాగే.. భారతీయ జనతా పార్టీతో రీ యూనియన్ కావాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రమంత్రులతో టీడీపీ ఎంపీల రహస్యభేటీలు సాగుతున్నాయన్నారు. కేంద్రంతో పోరాటపంథాతో వెళ్తే తన అక్రమాలు బయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారు.. అందుకే రాజీ ప్రయత్నాల్లో ఉన్నారు.. అని విజయసాయి రెడ్డి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.