యాప్నగరం

విక్రమ్ గౌడ్‌కి బెయిల్ మంజూరు.. షరతులు వర్తిస్తాయి

ఫిలింనగర్‌లోని తన నివాసంలో తనపై తానే ఏర్పాటు చేయించుకున్న కిరాయి గూండాలతో కాల్పులు జరిపించుకున్న కేసులో...

TNN 19 Aug 2017, 5:03 pm
ఫిలింనగర్‌లోని తన నివాసంలో తనపై తానే ఏర్పాటు చేయించుకున్న కిరాయి గూండాలతో కాల్పులు జరిపించుకున్న కేసులో మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌కి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విక్రమ్ గౌడ్‌కి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు పలు షరతులు విధించింది. కోర్టు విధించిన షరతుల ప్రకారం విక్రమ్ గౌడ్ తన పాస్‌పోర్టుని పోలీసులకి సరెండర్ చేయడంతోపాటు ప్రతీ ఆదివారం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వుంటుంది. అంతేకాకుండా పోలీసులకి సమాచారం ఇవ్వకుండా నగరం విడిచివెళ్లకూడదనే షరతు కూడా విధించినట్టు తెలుస్తోంది.
Samayam Telugu vikram goud gets bail in shooting case
విక్రమ్ గౌడ్‌కి బెయిల్ మంజూరు.. షరతులు వర్తిస్తాయి


తనపై హత్యాయత్నం జరిగిందని అందరినీ నమ్మించడానికి తనపై కాల్పులకి పాల్పడమని ఆదేశిస్తూ ఓ సుపారీ బ్యాచ్‌కి సుపారీ ఇవ్వడంతోపాటు వారితో కాల్పులు జరిపించుకున్న కేసులో ప్రస్తుతం విక్రమ్ గౌడ్‌‌ విచారణ ఎదుర్కుంటున్నాడు. ఈ ఘటనలో సుపారీ బ్యాచ్ జరిపిన కాల్పుల్లో గాయపడిన విక్రమ్ గౌడ్‌ని ఆస్పత్రిలో కోలుకున్న వెంటనే ఆగస్టు 3వ తేదీన అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విక్రమ్ గౌడ్ చంచల్‌గూడ జైలులో ఖైదీగా వున్నాడు. ఈ కేసులో విక్రమ్ గౌడ్ సహా మొత్తం ఆరుగురు అరెస్ట్ అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.