సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత విజయవాడకు దూరమైన పవన్.. మళ్లీ పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి గురువారం బెజవాడ చేరుకున్న జనసేనాని.. ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్షలు మొదలుపెట్టారు. పార్టీ నేతలతో ఎన్నికల్లో జనసేన ఓటమిపై సమీక్షలు చేస్తున్నారు. 13 జిల్లాలో నేతలతో పార్టీ ఓటమి, పంచాయతీ ఎన్నికల్లో పోటీ అంశాలపై చర్చిస్తున్నారు. సమీక్షల్లో భాగంగా తొలిరోజు కృష్ణా, ప.గో జిల్లాల నేతలతో జనసేనాని సమీక్షలు నిర్వహించారు. అంతకముందు విజయవాడ వస్తున్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్ను కృష్ణాజిల్లా కేసరపల్లి గ్రామంలో సూరంపల్లి గ్రామస్థులు, యువకులు అడ్డుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించారు. డంపింగ్ యార్డ్తో కష్టాలుపడుతున్నామని.. తమ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని పవన్ను కోరారు. జనసేనానికి వినతి పత్రం అందజేశారు. సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషిచేస్తానని పవన్ గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ కారును అడ్డుకున్న గ్రామస్థులు
విజయవాడ వస్తున్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్ను కృష్ణాజిల్లా కేసరపల్లి గ్రామంలో సూరంపల్లి గ్రామస్థులు, యువకులు అడ్డుకున్నారు. డంపింగ్ యార్డ్తో కష్టాలుపడుతున్నామని.. తమ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని పవన్ను కోరారు.
Samayam Telugu 6 Jun 2019, 2:30 pm
ప్రధానాంశాలు:
- విజయవాడ చేరుకున్న జనసేన అధినేత పవన్
- ఎన్నికల్లో జనసేన ఓటమిపై పవన్ వరుస సమీక్షలు
- దారి మధ్యలో పవన్ కారును అడ్డుకున్న గ్రామస్థులు