యాప్నగరం

మంత్రి గంటాపై సిట్‌కు మరో మంత్రి ఫిర్యాదు!

విశాఖలో వెలుగుచూసిన భూకుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన దర్యాప్తు సంస్థకు మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరోమంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారు.

TNN 16 Jul 2017, 10:43 am
విశాఖలో వెలుగుచూసిన భూకుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన దర్యాప్తు సంస్థకు మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరోమంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారు. భూముల రికార్డుల తారుమారు వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందంటూ అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేయడంతో తెలుగుదేశం పార్టీలో కలకలం రేగుతోంది. ఇది నేతల మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టింది. సిట్ అధికారులను కలిసిన అయ్యన్న ఈ వ్యవహారంలో గంటా, ఆయన బంధువుల పాత్ర గురించి ఆధారాలను అందించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అధికారులను బుధవారం కలిసి మరిన్ని ఆధారాలు అందజేస్తానని అయ్యన్నపాత్రుడు ప్రకటించడంతో, గంటా వర్గంలో ఆందోళన మరింత పెరిగింది.
Samayam Telugu visakhapatnam land scam tdp minister allegations on ganta srinivasarao
మంత్రి గంటాపై సిట్‌కు మరో మంత్రి ఫిర్యాదు!


ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం గంటా హుటాహుటిన విజయవాడకు బయలుదేరడంపై ఆయన సీఎం చంద్రబాబును కలిసేందుకే వెళ్లినట్లు సమాచారం. కాగా, గంటా బంధువైన పరుచూరి భాస్కర రావు ప్రభుత్వ భూములను తమవిగా చూపించి, ఇండియన్ బ్యాంకు నుంచి రూ. 190 కోట్ల రుణాన్ని తీసుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అలాగే గంటాకు సన్నిహితుడైన అనకాపల్లి శాసనసభ్యుడు పీలా గోవింద సత్యనారాయణపైనా ఆయన ఆరోపణలు గుప్పించారు. ఈయన ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాదు, జమిందార్లకు చెందిన 48 ఎకరాలను కూడా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.