యాప్నగరం

విట్ వర్శిటీతో 30 వేల మందికి సాంకేతిక విద్య

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో విట్ వర్శిటీకి శంకుస్థాపన జరిగింది.

TNN 3 Nov 2016, 2:53 pm
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మొట్టమొదటి విద్యా సంస్థకు శంకుస్థాపన జరిగింది. గురువారం రాజధాని పరిధిలోని ఐనవోలులో ప్రతిష్టాత్మకమైన వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) కు సీఎం చంద్రబాబు, కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. విట్ వర్శిటీ కోసం ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించగా.. తొలిదశలో 100 ఎకరాల్లో దీని నిర్మాణం చేపట్టనున్నారు.ఈ వర్శిటీ నిర్మాణం పూర్తయితే ప్రతి ఏటా 30 వేల మంది వరకు సాంకేతి విద్యను అభ్యసించే అవకాశం కల్గుతుంది. కాగా ఈ కార్యక్రమంలో మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Samayam Telugu vit university stone foundation laid at amaravati
విట్ వర్శిటీతో 30 వేల మందికి సాంకేతిక విద్య



ఈ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ..భారత దేశంలో ఉన్న అన్ని ఉత్తమ వర్శిటీలన్నీ అమరావతికి వస్తాయని పేర్కొన్నారు. ఎలాంటి విద్యనైనా ఇక్కడ చదువుకో వచ్చని విద్యార్ధులకు భరోసా ఇచ్చారు. విదేశీయులు కూడా మన రాష్ట్రానికి వచ్చి చదువుకునే పరిస్థితులు కల్పిస్తామని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు ముందు చూపు వల్లే ఈ వర్శిటీ - వెంకయ్య



ఏపీ సీఎం చంద్రబాబు ముందుచూపు వల్లే ఇక్కడ విట్ వర్శిటీకి ఏర్పడుతుందని కేంమంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) ద్వారా 32 వేల మందికి సాంకేతిక విద్య అందనుందన్నారు. దీంతో ఏపీకి మరిన్ని వర్శిటీ లో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.