ఆ దంపతులకు అప్పటికే ఇద్దరు చిన్నారులు అనారోగ్యం కారణంగా మరణించారు. పదో తరగతి ఉత్తీర్ణుడైన మరో కుమారుడు ఏరి కోరి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో చేరాడు. కాలేజీలో చేరిన రెండో రోజే తరగతులకు వెళ్తూ అనూహ్యంగా మృత్యువాతపడ్డాడు. ఆలస్యమవుతోందని అడ్డదారి ఎంచుకోవడమే అతడికి శాపమైంది. రైలు రూపంలో మృత్యువు అతణ్ని కబళించింది. కన్నవారికి తీరని కడుపుకోత మిగిల్చింది. విజయనగరం జిల్లా గరివిడిలో ఈ విషాదం చోటుచేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొండంపేట గ్రామానికి చెందిన అనుపోజు సురేష్ (17) గరివిడి పట్టణంలోని అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో (మెకానికల్) ప్రవేశం పొందాడు. కౌన్సెలింగ్లో తన స్వగ్రామానికి సమీపంలోని బొబ్బిలి కాలేజీలో సీటు వచ్చినా కాదనుకున్నాడు. స్నేహితులు చదువుతున్న కాలేజీలోనే చేరుతానని పట్టుబట్టి ఇంట్లో వాళ్లను ఒప్పించాడు.
సురేష్ శుక్రవారం (జులై 6) ఉదయం కాలేజీకి వచ్చేందుకు రాజాం నుంచి గరివిడికి బస్సులో చేరుకున్నాడు. బద్రిప్రసాద్ కాలనీ సమీపంలో రైల్వే వంతెన వద్ద దిగాడు. అప్పటికే ఆలస్యం కావడంతో తొందరగా చేరుకోవాలని అడ్డదారిని ఎంచుకున్నాడు. రైల్వే వంతెనను వదిలేసి పట్టాలు దాటి వెళ్లాలనుకున్నాడు. దూరం నుంచి ఓ గూడ్సు రైలు దూసుకొస్తోంది. ఈలోగా పట్టాలు దాటేయొచ్చని భావించి సురేష్ ముందుకు కదిలాడు.
దురదృష్టవశాత్తూ సురేష్ కాలి బూటు పట్టా కింద ఇరుక్కుపోయింది. దీంతో అతడు పట్టాలపై పడిపోయాడు. లేచి బూటు నుంచి కాలును తప్పించుకొని బయటపడాలని ప్రయత్నిస్తుండగానే గూడ్సు రైలు అతడిపై నుంచి దూసుకెళ్లింది. సురేష్ మీదుగా రైలు చక్రాలు దూసుకుపోవడంతో శరీరం రెండు ముక్కలై పట్టాల పక్కన పడిపోయింది..
ట్రాక్ అవతల నుంచి ఆ దృశ్యాన్ని చూసిన తోటి విద్యార్థులు షాక్ తిన్నారు. పట్టా కింద షూ ఇరుక్కోకుండా ఉంటే సురేష్ కూడా తమలాగే సురక్షితంగా బయటపడేవాడంటూ వారు కన్నీరు పెట్టుకున్నారు..
ఎదిగిన కొడుకు అండగా ఉంటాడనుకుంటే..
సురేష్ తండ్రి బ్రహ్మం రాజాంలో ఓ జూట్ మిల్లులో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి లక్ష్మి గృహిణి. ఈ దంపతులకు అనారోగ్య కారణంతో ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఒక కొడుకు, కుమార్తె మృతి చెందారు. దీంతో ఆశలన్నీ సురేష్పైనే పెట్టుకున్నారు. అతడు కూడా మృతి చెందడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
కాలేజీలో అడుగుపెట్టాడని బూట్లు కొనిస్తే..
‘కుమారుడు హైస్కూలు విద్య పూర్తి చేసి కొత్తగా కాలేజీలో చేరాడు. షూ వేసుకొని తరగతులకు వెళ్తానని సరదా పడ్డాడు. వారం రోజుల కిందట అతడికి షూ కొనిచ్చా. ఇప్పుడు అవే అతడి పాలిట శాపమయ్యాయి’ అని సురేష్ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. వృద్ధాప్యంలో ఆదుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఇప్పుడు బిడ్డే లేకుండా పోయాడు, ఇక మాకు దిక్కెవరంటూ ఆ దంపతులు రోదించడం పలువురుని కంటతడి పెట్టించింది.
శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొండంపేట గ్రామానికి చెందిన అనుపోజు సురేష్ (17) గరివిడి పట్టణంలోని అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో (మెకానికల్) ప్రవేశం పొందాడు. కౌన్సెలింగ్లో తన స్వగ్రామానికి సమీపంలోని బొబ్బిలి కాలేజీలో సీటు వచ్చినా కాదనుకున్నాడు. స్నేహితులు చదువుతున్న కాలేజీలోనే చేరుతానని పట్టుబట్టి ఇంట్లో వాళ్లను ఒప్పించాడు.
సురేష్ శుక్రవారం (జులై 6) ఉదయం కాలేజీకి వచ్చేందుకు రాజాం నుంచి గరివిడికి బస్సులో చేరుకున్నాడు. బద్రిప్రసాద్ కాలనీ సమీపంలో రైల్వే వంతెన వద్ద దిగాడు. అప్పటికే ఆలస్యం కావడంతో తొందరగా చేరుకోవాలని అడ్డదారిని ఎంచుకున్నాడు. రైల్వే వంతెనను వదిలేసి పట్టాలు దాటి వెళ్లాలనుకున్నాడు. దూరం నుంచి ఓ గూడ్సు రైలు దూసుకొస్తోంది. ఈలోగా పట్టాలు దాటేయొచ్చని భావించి సురేష్ ముందుకు కదిలాడు.
దురదృష్టవశాత్తూ సురేష్ కాలి బూటు పట్టా కింద ఇరుక్కుపోయింది. దీంతో అతడు పట్టాలపై పడిపోయాడు. లేచి బూటు నుంచి కాలును తప్పించుకొని బయటపడాలని ప్రయత్నిస్తుండగానే గూడ్సు రైలు అతడిపై నుంచి దూసుకెళ్లింది. సురేష్ మీదుగా రైలు చక్రాలు దూసుకుపోవడంతో శరీరం రెండు ముక్కలై పట్టాల పక్కన పడిపోయింది..
ట్రాక్ అవతల నుంచి ఆ దృశ్యాన్ని చూసిన తోటి విద్యార్థులు షాక్ తిన్నారు. పట్టా కింద షూ ఇరుక్కోకుండా ఉంటే సురేష్ కూడా తమలాగే సురక్షితంగా బయటపడేవాడంటూ వారు కన్నీరు పెట్టుకున్నారు..
ఎదిగిన కొడుకు అండగా ఉంటాడనుకుంటే..
సురేష్ తండ్రి బ్రహ్మం రాజాంలో ఓ జూట్ మిల్లులో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి లక్ష్మి గృహిణి. ఈ దంపతులకు అనారోగ్య కారణంతో ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఒక కొడుకు, కుమార్తె మృతి చెందారు. దీంతో ఆశలన్నీ సురేష్పైనే పెట్టుకున్నారు. అతడు కూడా మృతి చెందడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
కాలేజీలో అడుగుపెట్టాడని బూట్లు కొనిస్తే..
‘కుమారుడు హైస్కూలు విద్య పూర్తి చేసి కొత్తగా కాలేజీలో చేరాడు. షూ వేసుకొని తరగతులకు వెళ్తానని సరదా పడ్డాడు. వారం రోజుల కిందట అతడికి షూ కొనిచ్చా. ఇప్పుడు అవే అతడి పాలిట శాపమయ్యాయి’ అని సురేష్ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. వృద్ధాప్యంలో ఆదుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఇప్పుడు బిడ్డే లేకుండా పోయాడు, ఇక మాకు దిక్కెవరంటూ ఆ దంపతులు రోదించడం పలువురుని కంటతడి పెట్టించింది.