యాప్నగరం

​ కోస్ట్‌గార్డ్‌లో ఉన్నత పదవికి తెలుగు వ్యక్తి

భారత సముద్ర తీర రక్షణ దళంలో ఉన్నత పదవికి తెలుగు వ్యక్తి నియమితులయ్యారు.

TNN 19 Aug 2016, 9:26 am
భారత సముద్ర తీర రక్షణ దళంలో ఉన్నత పదవికి తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. వీఎస్‌ఆర్ మూర్తి అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు. 1984లో కోస్ట్ గార్డ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా చేరిన ఈయన 32 ఏళ్ల పాటూ సుదీర్ఘంగా దేశం కోసం పనిచేశారు. 2009లో ఫ్లాగ్ ర్యాంక్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా పదోన్నతి పొందారు. కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్స్ విభాగానికి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా కూడా పనిచేశారు. 2014లో నార్త్ ఈస్ట్ రీజియన్ కమాండెంట్ గా కూడా నియమితులయ్యారు. 2012లో విశిష్ట సేవకు గానూ రాష్ట్రపతి కోస్ట్ గార్డ్ పతకం అందుకున్నారు. మూర్తి స్వస్థలం తాడేపల్లి గూడెంలోని ఉంగుటూరు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.