గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్, తెలంగాణ ప్రభుత్వంతో మెగా ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ లో మొత్తం 50 స్టోర్లను ఏర్పాటు చేయనున్న వాల్మార్ట్.. తెలంగాణలో 10 వాల్ మార్ట్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒక్కో స్టోర్ కు 10 మిలియన్ డాలర్ల నుంచి 12 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టునున్నట్టు సంస్థ వెల్లడించింది. వచ్చే మూడు నాలుగేళ్ల స్టోర్లు అందుబాటులో ఉంటాయని శనివారం సంస్థ తెలిపింది.
ఇప్పటికే వాల్ మార్ట్ దేశంలో 21 స్టోర్లు ఉండగా, అందులో ఒకటి హైదరాబాద్ లో ఉంది. ఈ స్టోర్ల కింద 30వేల కిరాణం దుకాణాలు పనిచేస్తున్నాయి.
శనివారం రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, వాల్ మార్ట్ కెనడా, ఆసియా సీఈవో, ప్రెసిడెంట్ డిర్క్ వాన్ డెన్ బెర్గె, వాల్ మార్ట్ ఇండియా సీఈవో ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ ల ఆధ్వర్యంలో వాల్ మార్ట్ ఎగ్జిక్యూటివ్ లు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఎంఓయూ (ఒప్పందం) పై సంతకం చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ తో కూడా వాల్ మార్ట్ ఎంఓయూ కుదుర్చుకుంది.
వీటితోపాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలోనూ వాల్ మార్ట్ స్టోర్లు ఏర్పాటుకానున్నాయి. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలతోనూ వాల్ మార్ట్ డీల్ కుదుర్చుకుంది. తెలంగాణలో ఏర్పాటుచేయబోయే 10 వాల్ మార్ట్ స్టోర్లలో నాలుగు హైదరాబాద్ లోనే ఉండనున్నాయి. మిగతావి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇప్పటికే వాల్ మార్ట్ దేశంలో 21 స్టోర్లు ఉండగా, అందులో ఒకటి హైదరాబాద్ లో ఉంది. ఈ స్టోర్ల కింద 30వేల కిరాణం దుకాణాలు పనిచేస్తున్నాయి.
శనివారం రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, వాల్ మార్ట్ కెనడా, ఆసియా సీఈవో, ప్రెసిడెంట్ డిర్క్ వాన్ డెన్ బెర్గె, వాల్ మార్ట్ ఇండియా సీఈవో ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ ల ఆధ్వర్యంలో వాల్ మార్ట్ ఎగ్జిక్యూటివ్ లు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఎంఓయూ (ఒప్పందం) పై సంతకం చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ తో కూడా వాల్ మార్ట్ ఎంఓయూ కుదుర్చుకుంది.
వీటితోపాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలోనూ వాల్ మార్ట్ స్టోర్లు ఏర్పాటుకానున్నాయి. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలతోనూ వాల్ మార్ట్ డీల్ కుదుర్చుకుంది. తెలంగాణలో ఏర్పాటుచేయబోయే 10 వాల్ మార్ట్ స్టోర్లలో నాలుగు హైదరాబాద్ లోనే ఉండనున్నాయి. మిగతావి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.