యాప్నగరం

పురుగుల మందు తాగిన ప్రేమజంట.. యువతి మృతి

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయ సమీపంలో ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

TNN 13 Feb 2018, 11:32 pm
వరంగల్‌లో విషాదం చోటు చేసుకుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయ సమీపంలో ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడు అసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. హన్మకొండలోని సుబేదారికి చెందిన హరిప్రియ (17), పెండ్యాల సాయికుమార్ (18) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
Samayam Telugu warangal lovers commits suicide minor girl dead
పురుగుల మందు తాగిన ప్రేమజంట.. యువతి మృతి


సోమవారం (ఫిబ్రవరి 12) సాయంత్రం ప్రేమికులిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వారి కోసం కుటుంబసభ్యులు తీవ్రంగా గాలించారు. హరిప్రియ తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో కిడ్నాప్ కేసు పెట్టారు. మంగళవారం ఉదయం కాళేశ్వరం దేవస్థానం సమీపంలో ఇద్దరు యువతీయువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయాన్ని స్థానికులు గుర్తించారు.

స్థానికులు 108కు సమాచారం అందించడంతో.. 108 అంబులెన్స్ సిబ్బంది వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. హరిప్రియ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే కారణంతోనే వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. హరిప్రియ మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రులు సాయికుమార్‌పై కిడ్నాప్ కేసు పెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.