రిపేర్కి అని ఇంటికి వచ్చి.. హైదరాబాద్లోని ఓ గృహిణిపై మెకానిక్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్కి చెందిన గృహిణి.. ఇంటిలోని వాషింగ్ మిషన్ రిపేరుకి రావడంతో ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మియాపూర్లోని ఓ సర్వీస్ సెంటర్కి ఫోన్ చేసింది. అయితే.. సెంటర్ ఓనర్కి బదులు ఫోన్ తీసిన అతని మిత్రుడు పవన్తేజ్ రెడ్డి మెకానిక్ తరహాలో మాట్లాడి అడ్రస్ తీసుకున్నాడు. అనంతరం గృహిణి ఇంటికి వెళ్లి.. రిపేరు పేరుతో నాలుగైదు రోజులు ఆ వస్తువు తెప్పించాలి.. ఈ వస్తువులు కావాలి అంటూ కాలం వెళ్లదీశాడు. ఈ టైమ్లోనే ఆమె ఒంటరిగా ఉందని నిర్దారించుకున్న పవన్.. తొలుత ఆమెపై మత్తుమందు చల్లి.. స్పృహ కోల్పోయిన తర్వాత నగ్నంగా సెల్ఫోన్తో ఫొటోలు తీశాడు.
అనంతరం కొద్దిరోజుల తర్వాత ఆ గృహిణి ఇంటికి వెళ్లిన పవన్తేజ్ రెడ్డి.. ఆ ఫొటోలు చూపించి ఆమెని బెదిరించాడు. ఈ క్రమంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. రూ.35వేలు డబ్బులు కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా నిందితుడు తన వేధింపుల్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఇటీవల పవన్తేజ్ రెడ్డి అతని మిత్రులకి కూడా ఆ నగ్న ఫొటోల్ని చూపించినట్లు గృహిణికి తెలియడంతో.. అప్పటికే విసిగిపోయిన ఆమె బాచుపల్లి పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పవన్తేజ్ రెడ్డిని అరెస్టు చేసి.. న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపారు.
అనంతరం కొద్దిరోజుల తర్వాత ఆ గృహిణి ఇంటికి వెళ్లిన పవన్తేజ్ రెడ్డి.. ఆ ఫొటోలు చూపించి ఆమెని బెదిరించాడు. ఈ క్రమంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. రూ.35వేలు డబ్బులు కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా నిందితుడు తన వేధింపుల్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఇటీవల పవన్తేజ్ రెడ్డి అతని మిత్రులకి కూడా ఆ నగ్న ఫొటోల్ని చూపించినట్లు గృహిణికి తెలియడంతో.. అప్పటికే విసిగిపోయిన ఆమె బాచుపల్లి పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పవన్తేజ్ రెడ్డిని అరెస్టు చేసి.. న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపారు.