యాప్నగరం

వీడియో: గొర్రె దాటుడు.. రైలు కింద పడి 400 గొర్రెలు మృతి

ఓ గొర్రెల కాపరికి చెందిన గొర్రెలు గడ్డి మేసుకుంటూ.. ఓ రైల్వే ట్రాక్ పక్కకి వెళ్లాయి. ఇంతలో మందలోని ఓ గొర్రె ట్రాక్‌పైకి వచ్చింది. అదేసమయంలో ఎదురుగా రైలు వచ్చింది. రైలు వెళ్లిపోయాక చూస్తే సుమారు 400ల గొర్రెలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. ఈ ఘోరం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట వద్ద ఆదివారం (అక్టోబర్ 23) జరిగింది.

TNN 23 Oct 2017, 11:02 pm
ఓ గొర్రెల కాపరికి చెందిన గొర్రెలు గడ్డి మేసుకుంటూ.. ఓ రైల్వే ట్రాక్ పక్కకి వెళ్లాయి. ఇంతలో మందలోని ఓ గొర్రె ట్రాక్‌పైకి వచ్చింది. అదేసమయంలో ఎదురుగా రైలు వచ్చింది. రైలు వెళ్లిపోయాక చూస్తే సుమారు 400 గొర్రెలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. ఈ ఘోరం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట వద్ద ఆదివారం (అక్టోబర్ 22) జరిగింది. ఫలక్ నుమా ట్రెయిన్ ప్రయాణించే మార్గంలో ప్రమాదవశాత్తూ రైల్వే ట్రాక్‌పైకి గొర్రెల మంద రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని సౌత్ సెంట్రల్ రైల్వే పీఆర్‌వో బి. అనిల్‌కుమార్ ‘సమయం తెలుగు’కు తెలిపారు.
Samayam Telugu watch 400 sheep crushed under falaknuma train in telangana
వీడియో: గొర్రె దాటుడు.. రైలు కింద పడి 400 గొర్రెలు మృతి


జరిగిన బీభత్సాన్ని చూసి ఆ గొర్రెల కాపరి గుండెలు బాదుకున్నాడు. ట్రాక్ వెంట కుప్పలు తెప్పలుగా పడి ఉన్న ఆ భయానక దృశ్యం పలువురుని కంటతడి పెట్టించింది. ‘గొర్రె దాటుడు’ అంటే ఇదే..! ఓ కొండ ప్రాంతంలో గడ్డి మేస్తూ.. లోయలో పడి 300 గొర్రెలు మరణించిన ఉదంతం కొన్ని సంవత్సరాల కిందట సంచలనం రేకెత్తించింది. ఇప్పుడు అలాంటి ఉదంతమే తెలంగాణలో జరిగింది.

మూగజీవాలకు ఏం తెలుసు.. ట్రెయిన్ తమను చిదిమేస్తుందని..! మంద కాపరే వాటిని ప్రాణానికి ప్రాణంగా కాపాడుకోవాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.