భార్య వేధిస్తోంది.. ఆదుకోండి.. అంటూ ఓ డాక్టర్ సెల్టవర్ ఎక్కాడు. జగిత్యాల టౌన్లో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజయ్ అనే వ్యక్తి జగిత్యాల సమీపంలోని అర్పపెల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్గా పని చేస్తున్నాడు. దళిత వర్గానికి చెందిన అజయ్.. ఏడేళ్ల కిందట పద్మశాలి వర్గానికి చెందిన లాస్య అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే.. నాలుగేళ్ల కిందట లాస్య తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయింది. కొన్నాళ్ల కిందట మనసు మార్చుకొని మళ్లీ వచ్చింది. కానీ, కొద్ది రోజులు గడవక ముందే.. అజయ్తో మళ్లీ గొడవపడింది. తనను ఇంటి నుంచి వెల్లగొట్టి.. మళ్లీ అక్రమ కేసు పెట్టిందని అజయ్ ఆరోపిస్తున్నాడు.
పోలీసులు పదే పదే తనను స్టేషన్కు పిలుస్తున్నారని, తనను అస్సలు మాట్లాడనివ్వడం లేదని, తన భార్య చెప్పిందే నమ్ముతున్నారని అజయ్ చెబుతున్నాడు. ‘నా భార్య నన్ను వేధిస్తోంది. నాకు విడాకులు ఇప్పించండి’ అంటూ అతడు బుధవారం (నవంబర్ 15) స్థానికంగా ఉన్న ఓ సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
లాయర్ను అక్కడికే పిలిపించి తక్షణమే తనకు విడాకులు ఇప్పించాలని, లేకపోతే అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని అజయ్.. సెల్ టవర్ పై నుంచి చిట్టీలు రాసి కిందకి విసిరాడు. పోలీసులు ఎలాగోలా ఒప్పించి మొత్తం మీద అతణ్ని కిందకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతనికి కౌన్సెలింగ్ చేస్తున్నారు.
పోలీసులు పదే పదే తనను స్టేషన్కు పిలుస్తున్నారని, తనను అస్సలు మాట్లాడనివ్వడం లేదని, తన భార్య చెప్పిందే నమ్ముతున్నారని అజయ్ చెబుతున్నాడు. ‘నా భార్య నన్ను వేధిస్తోంది. నాకు విడాకులు ఇప్పించండి’ అంటూ అతడు బుధవారం (నవంబర్ 15) స్థానికంగా ఉన్న ఓ సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
లాయర్ను అక్కడికే పిలిపించి తక్షణమే తనకు విడాకులు ఇప్పించాలని, లేకపోతే అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని అజయ్.. సెల్ టవర్ పై నుంచి చిట్టీలు రాసి కిందకి విసిరాడు. పోలీసులు ఎలాగోలా ఒప్పించి మొత్తం మీద అతణ్ని కిందకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతనికి కౌన్సెలింగ్ చేస్తున్నారు.