యాప్నగరం

వీడియో: సామీ.. నన్ను బెజవాడ దుర్గమ్మ ఆవహించింది!

ఆంధ్రప్రదేశ్‌ పట్ల బీజేపీ తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు శుక్రవారం ఆందోళన చేశారు. ఎంపీ శివప్రసాద్‌ వినూత్న వేషధారణలో నిరసన చేపట్టి ఆకర్షించారు.

TNN 9 Feb 2018, 4:31 pm
సామీ... నన్ను విజయవాడ కనకదుర్గమ్మ ఆవహించింది.. తిరుపతి వెంకన్న సన్నిధిలో మోదీ హామీలు ఇచ్చి మరిచిపోయిండు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం లెక్కచేయడం లేదు. పార్లమెంట్‌ సాక్షిగా హెచ్చరిస్తున్నా. ఏపీలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీ కూడా పడుతుంది.. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆక్షేపణ ఇది. ఆంధ్రప్రదేశ్‌ పట్ల బీజేపీ తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు శుక్రవారం (ఫిబ్రవరి 9) ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శివప్రసాద్‌ వినూత్న వేషధారణలో నిరసన చేపట్టి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.
Samayam Telugu watch tdp mp siva prasadd tantrik protest at parliament
వీడియో: సామీ.. నన్ను బెజవాడ దుర్గమ్మ ఆవహించింది!


పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించిన టీడీపీ ఎంపీలు.. వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ ఏపీ ఎంపీల ఆందోళనతో లోక్‌సభ అట్టుడికింది. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేస్తూ.. టీడీపీ, వైసీపీ ఎంపీలు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి నిరసన చేపట్టారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మార్చి 5కు వాయిదా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.