యాప్నగరం

Srisailam Dam: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌‌కు పోటెత్తిన వరద..

శ్రీ‌శైలం నుంచి నీటిని దిగువకు వదులుతుండటంతో నాగార్జున సాగ‌ర్‌కు వ‌ర‌ద తీవ్రత పెరుగుతోంది. దీంతో సాగ‌ర్ ప్రాజెక్టు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుంది.

Samayam Telugu 22 Aug 2018, 12:26 pm
శ్రీ‌శైలం నుంచి నీటిని దిగువకు వదులుతుండటంతో నాగార్జున సాగ‌ర్‌కు వ‌ర‌ద తీవ్రత పెరుగుతోంది. దీంతో సాగ‌ర్ ప్రాజెక్టు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుంది. సాగ‌ర్ పూర్తిస్థాయి నీటి మ‌ట్టం 590 అడుగులు కాగా.. బుధవారం ఉద‌యం 10 గంట‌ల‌ సమయానికి నీటిమ‌ట్టం 551.7 అడుగుల‌కు చేరుకుంది. ప్ర‌స్తుతానికి నాగార్జున‌సాగ‌ర్‌లో 213.539 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో 1,56,645 క్యూసెక్స్, అవుట్‌ఫ్లో 9,788 క్యూసెక్కులుగా ఉంది.
Samayam Telugu Telugu-image


మరోవైపు శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి వరద ప్రవాహం కొనసాగుతూనే దీంతో.. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. 1.87 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో 1.99 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బుధవారం ఉదయం 10 గంటల స‌మ‌యానికి శ్రీ‌శైలం డ్యాంలో గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.2 అడుగుల మేర ఉంది. ప్రస్తుతం జలాశయంలో 205 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.