యాప్నగరం

శ్రీశైలం డ్యామ్‌కు పెరుగుతున్న వరద.. 8 గేట్లు ఎత్తివేత!

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే జలాశయం 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

Samayam Telugu 23 Aug 2018, 12:28 pm
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో గురువారం 8 గేట్లను తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటల సమయానికి ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 3,26,305 లక్షల క్యూసెక్కుల్లుగా ఉంది. అవుట్ ఫ్లో 3,21,249 క్యూసెక్కులు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883. 4 అడుగులుగా ఉంది.
Samayam Telugu srisailam


జలాశయం పూర్తిస్థాయి నీటినిలువ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 206.536 టీఎంసీల నీరు నిలువ ఉంది. జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.