యాప్నగరం

ఇక ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఉండదు.. పోలవరమే చివరిది: కేంద్రం

ఇక ఏ రాష్ట్రంలోనూ ప్రాజెక్టులనూ జాతీయ ప్రాజెక్టుగా చేపట్టబోమని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరమే చివరి జాతీయ ప్రాజెక్టు అని లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు.

Samayam Telugu 10 Aug 2018, 7:59 am
ఇక ఏ రాష్ట్రంలోనూ ప్రాజెక్టులనూ జాతీయ ప్రాజెక్టుగా చేపట్టబోమని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరమే చివరి జాతీయ ప్రాజెక్టు అని లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. గురువారం లోక్‌సభలో సీపీఎం ఎంపీ మహమ్మద్‌ సలీం అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఏపీ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు పోలవరానికి జాతీయ హోదా కల్పించారని, అందుకే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని మేం పనిచేస్తున్నామని అన్నారు. అంతే కాదు ఇది పూర్తయిన తర్వాత మరే ప్రాజెక్టునూ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. కొండ ప్రాంతాలు, ఈశాన్యరాష్ట్రాల్లో చేపట్టే ప్రాజెక్టులకు 90 శాతం నిధులను కేంద్రం, మిగతా 10 శాతం రాష్ట్రాలు సమకూరుస్తాయని గడ్కరీ తెలిపారు. ఏఐబీపీ కింద 9 ప్రాజెక్టులుండగా, కరువుపీడిత ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్రాల వాటా 60: 40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయని అన్నారు. రాజ్యాంగం ప్రకారం సాగునీటి బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలదేనని, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే విధానం ఇప్పుడు లేదని స్పష్టం చేశారు.
Samayam Telugu పోలవరం ప్రాజెక్టు


ఒకవేళ ఏవైనా రాష్ట్రాలు ప్రాజెక్టులను నిర్మించాలనుకుంటే ఈ నిష్పత్తికిందికే వస్తాయని, ఇకపై జాతీయ ప్రాజెక్టులుగా దేన్నీ ప్రకటించమని గడ్కరీ పేర్కొన్నారు. గడ్కరీ సమాధానంపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్‌ వివరణ కోరడానికి ప్రయత్నించినా అవకాశం మాత్రం రాలేదు. దీంతో ఆయన గడ్కరీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. పోలవరాన్ని ఏపీ విభజన చట్టం కింద జాతీయ ప్రాజెక్టుగా చేపట్టామని ప్రభుత్వం సమర్థించుకోవచ్చని, ఇదే సమయంలో తమ రాష్ట్రాన్ని కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని వినోద్ తన లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారమే తెలంగాణ కూడా ఏర్పడిందని, ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో కాళేశ్వరానికి కూడా జాతీయ హోదా ఇస్తామన్నారని ఎంపీ వినోద్ లేఖలో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.