కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా స్వయంకృషితో ముందుకుపోదామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఉదయం నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ... మూడేళ్లుగా రెండంకెల వృద్ధి సాధిస్తున్నామని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి సూచించారు. అభివృద్ధి ఎప్పుడూ ఆగడానికి వీల్లేదని, మన హక్కులపై రాజీ పడేది లేదని అన్నారు. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెలాఖరుకల్లా ఉపాధి హామీ పథకం లక్ష్యాలను చేరుకోవాలని, ఉపాధి కూలీలకు వేతనాలు సక్రమంగా చెల్లించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
వడగాలులు, అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పంట సంజీవనిని చురుకుగా చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. పంటకుంటల తవ్వకం పనులు ముమ్మరంగా నిర్వహించాలని, వేసవిలో తాగునీరు, విద్యుత్ కొరత లేకుండా చూడాలన్నారు. ప్రతిగ్రామంలో పోషకాహార ఉద్యానవనాలను పెంచాలని, కరవు మండలాల్లో సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అధికారులకు సూచించారు.
వడగాలులు, అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పంట సంజీవనిని చురుకుగా చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. పంటకుంటల తవ్వకం పనులు ముమ్మరంగా నిర్వహించాలని, వేసవిలో తాగునీరు, విద్యుత్ కొరత లేకుండా చూడాలన్నారు. ప్రతిగ్రామంలో పోషకాహార ఉద్యానవనాలను పెంచాలని, కరవు మండలాల్లో సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అధికారులకు సూచించారు.