యాప్నగరం

2019లో అధికారం మాదే: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేసీఆర్ మూడేళ్ల పాలనలో కోటి రతనాల వీణ తెలంగాణను అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని

Samayam Telugu 1 Jun 2017, 7:53 pm
కేసీఆర్ మూడేళ్ల పాలనలో కోటి రతనాల వీణ తెలంగాణను అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ పాలనకు మూడేళ్లు ముగిసిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు.
Samayam Telugu we will form government in 2019 uttam kumar reddy
2019లో అధికారం మాదే: ఉత్తమ్ కుమార్ రెడ్డి


ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోటి రతనాల వీణ తెలంగాణను కేసీఆర్ పాలనలో అప్పుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. మోదీ పాలనలో దేశప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్...వాటిని విస్మరించి రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు.

2019లో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.