యాప్నగరం

సొంతంగా అధికారంలోకి వస్తాం: కోదండరాం

రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, తెలంగాణలోని అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు

Samayam Telugu 23 May 2018, 3:12 pm
రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, తెలంగాణలోని అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. తమ పార్టీకి ప్రజలు పూర్తి మెజారిటీని కట్టబెడతారని, తాము సొంతంగా అధికారంలోకి వస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Samayam Telugu kodandaram


హైదరాబాద్‌లోని తమ పార్టీ కార్యాలయంలో కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశాలు లేవు అని స్పష్టం చేశారు. తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని అన్నారు. తాము కింగ్ మేకర్ కాదు, కింగ్ అవుతామని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

కర్ణాటక ప్రజల ఆకాంక్షలను జాతీయ పార్టీలు తీర్చలేకపోయాయని, అందుకే అక్కడ అలాంటి ఫలితాలు వచ్చాయని కోదండరాం అభిప్రాయపడ్డారు. పెట్రో ధరల పెరుగుదల వల్ల జనసామాన్యం తీవ్రంగా ఇక్కట్లు పడుతోందన్నారు. పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి తాము సమాయత్తం అవుతున్నాయని, పోటీ చేసే ఆసక్తితో అనేక మంది దరఖాస్తు చేశారని కోదండరాం ప్రకటించారు. పొత్తులు ఉండవు, తాము తెలంగాణలో సొంతంగా అధికారంలోకి వస్తామని కోదండరాం విశ్వాసం వ్యక్తం చేయడం మాత్రం చర్చనీయాంశంగా నిలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.