యాప్నగరం

రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కూ రుణ‌మాఫీ: ల‌క్ష్మ‌ణ్‌

తెలంగాణ‌లో రుణ మాఫీ పథకం ప్రధాన రాజకీయపక్షాలకు మరోసారి ఎన్నికల ప్రచారాస్త్రం కాబోతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదని విమర్శిస్తున్న కాంగ్రెస్‌.. తాము అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల మేర రుణ మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది.

TNN & Agencies 24 Feb 2018, 10:20 am
తెలంగాణ‌లో రుణ మాఫీ పథకం ప్రధాన రాజకీయపక్షాలకు మరోసారి ఎన్నికల ప్రచారాస్త్రం కాబోతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదని విమర్శిస్తున్న కాంగ్రెస్‌.. తాము అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల మేర రుణ మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. తాజాగా, భారతీయ జనతా పార్టీ కూడా అదే బాటలో పయనిస్తోంది. తాము అధికారంలోకి వస్తే రూ.2లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటిస్తోంది.
Samayam Telugu we will waive loan upto 2 lakh for farmers
రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కూ రుణ‌మాఫీ: ల‌క్ష్మ‌ణ్‌



మరో అడుగు ముందుకేసి పంట రుణాలపై బ్యాంకులకు రైతులు చెల్లించే వడ్డీని తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని, రైతులకు ఉచితంగా బోరు బావులు వేసి ఇస్తామని హామీ ఇవ్వబోతోంది. పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్తు, రైతు పెట్టిన పెట్టుబడికి 50శాతం అదనంగా లాభం చేకూరేలా రూ. 5వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తామని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయే రైతులను ఆదుకునేందుకు స్థిరీకరణ నిధి తదితర అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు సంఘాలు, శాస్త్రవేత్తలతో కమిటీలు ఏర్పాటు చేసి సాగును లాభసాటిగా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. వ్యవసాయం పండుగ అనుకునే విధంగా రైతులకు ప్రయోజనాలు కల్పిస్తామని, నిరుద్యోగ యువతను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటామని లక్ష్మణ్ వివ‌రించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.