యాప్నగరం

వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లలో గెలుస్తాం: జగన్

వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం అని విశ్వాసం చేయడమే గాక, జగన్ ఇలా నంబర్ ను చెప్పడమే ఆసక్తిదాయకంగా మారింది.

TNN 22 Nov 2017, 9:08 am
వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘ప్రజాసంకల్పం’ పాదయాత్రలో భాగంగా జగన్ తన ప్రసంగంలో ఎన్నికల్లో విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ‘మరో ఏడాది, ఏడాదీన్నరలో మన ప్రభుత్వం వస్తుంది..’ అని జగన్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా పాదయాత్రలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 137 సీట్లలో విజయం సాధిస్తుంది.. అని అన్నారు.
Samayam Telugu we will win 137 seatsys jagan
వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లలో గెలుస్తాం: జగన్


వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం అని విశ్వాసం చేయడమే గాక, జగన్ ఇలా నంబర్ ను చెప్పడమే ఆసక్తిదాయకంగా మారింది. 137 సీట్లలో గెలుస్తాం.. అని జగన్ అంటున్నారు. కర్నూలు జిల్లాలో మంగళవారం ఏడో రోజున జగన్ పాదయాత్ర సాగింది. డోన్ నియోజకవర్గం పరిధిలోని బేతంచర్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించింది.

మంగళవారంతో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 14 రోజులను పూర్తి చేసుకుంది. మొత్తం 196 కిలోమీటర్ల దూరాన్ని నడిచారు వైసీపీ అధినేత. పదిహేనవ రోజు పాదయాత్ర కొలుముల పల్లె నుంచి ప్రారంభం అయ్యింది. సర్పరాజపురంలో నేడు వైసీపీ సభ జరగనుంది. నేటి పాదయాత్రతో జగన్ రెండు వందల కిలోమీటర్ మైలురాయిని దాటనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.