ఎడతెరపిలేని వర్షాలతో ఇప్పటికే అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచనలు అందాయి. రానున్న 48 గంటల్లోపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన అప్పపీడనం .. మరో 24 గంటల్లోపు బలపడుతుందని తెలిపింది. ఈ కారణం చేత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే మేఘావృతమై ఉంది. ఏపీలో కూడా మధ్యాహ్నానికి కల్లా వాతావరణం చల్లపడే అవకాశముందని వాతావారణశాఖ తెలిపింది. భారీ వర్ష సూచనల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు చర్యలు తీసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచన
ఎడతెరపిలేని వర్షాలతో ఇప్పటికే అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచనలు అందాయి.
TNN 5 Oct 2016, 8:13 am