యాప్నగరం

కేసీఆర్ గురించి తన పుస్తకంలో ప్రణబ్ ఏమన్నారంటే..?

కేసీఆర్‌కు, ఇతర నాయకులకు తేడా ఏంటనేది ప్రణబ్ తన పుస్తకంలో వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ చేరిన సంగతి తెలిసిందే.

TNN 22 Oct 2017, 3:59 pm
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ జీవిత విశేషాలను పుస్తక రూపంలో వెలువరించిన సంగతి తెలిసిందే. ‘The Coalition Years: 1996-2012’లో ఆయన తన రాజకీయ అనుభవాల్ని పొందుపరిచారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న ఆయన ఆ పుసక్తంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కూడా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఉద్యమం నడిపిన సంగతి తెలిసిందే.
Samayam Telugu what pranab mukherjee said of kcr in his book
కేసీఆర్ గురించి తన పుస్తకంలో ప్రణబ్ ఏమన్నారంటే..?


కేసీఆర్‌కు, ఇతర నాయకులకు తేడా ఏంటనేది ప్రణబ్ తన పుస్తకంలో వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ చేరిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా యూపీఏకు మద్దతునిచ్చింది. ఆ పార్టీ అధినేత శిబు సోరెన్‌కు కేబినెట్‌లో అవకాశం కల్పించగా.. తన పార్టీకి రెండో మంత్రి కావాలని ఆయన డిమాండ్ చేశారట.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌ను ఏ శాఖ కావాలని ప్రశ్నించగా.. ‘ప్రణబ్ జీ నా లక్ష్యం ఏంటో మీకు తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి. మీరు నాకు ఏ శాఖను కేటాయించారనేది ముఖ్యం కాదు. మీరేది కేటాయించినా నాకు సమ్మతమే. కానీ దయ చేసి తెలంగాణ మాత్రం ఇవ్వండని కోరారు’ అని ప్రణబ్ తన పుసక్తంలో రాసుకొచ్చారు.

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ రెండూ పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను ప్రశంసిస్తూ.. ప్రణబ్ తన పుస్తకంలో రాయడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.