యాప్నగరం

ఆర్కే ఎక్కడున్నారో చెప్పండి: హైకోర్టు

భారీ ఎన్‌కౌంటర్ అనంతరం మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీ తెలియరాలేదు.

TNN 31 Oct 2016, 5:24 pm
ఏవోబీ పరిధిలో అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్‌కౌంటర్ అనంతరం మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీ తెలియరాలేదు. ఆర్కే భార్య శిరీష అలియాస్ పద్మ తన భర్త పోలీసు కస్టడీలోనే ఉన్నాడంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై సోమవారం మధ్యాహ్నం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు ఆర్కే ఎక్కడున్నాడో వెంటనే తెలియజేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్కే చనిపోయాడా లేదా పోలీసుల కస్టడీలో ఉన్నాడా తెలపాలని ఆదేశించింది. ఒకవేళ పోలీసుల అదుపులోనే ఉంటే ఎలాంటి ప్రాణహాని తలపెట్టవద్దని ఆదేవించింది. మావోయిస్టైనా, సామాన్య మనిషైనా... ప్రాణాలు విలువైనవని తెలిపింది. ఆర్కే ఎక్కడున్నాడన్న విషయమై సమగ్ర సమాచారంతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Samayam Telugu where is maoist rk high court orders ap govt to file counter
ఆర్కే ఎక్కడున్నారో చెప్పండి: హైకోర్టు


కోర్టు ముందు ఆర్కే భార్య శిరీష మాట్లాడుతూ తన భర్త పోలీసుల అదుపులోనే ఉన్నాడని, అతడిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఆర్కేకు ప్రాణహాని ఉందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.