యాప్నగరం

టీడీపీకి సోము సరైనోడు.. అసెంబ్లీ లాబీలో సరదా చర్చ

ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై అసెంబ్లీ లాబీల్లో సరదా చర్చ నడిచింది. తాను అధ్యక్షుడ్ని కావడం లేదన్న మాణిక్యాలరావు... కొత్త బాంబు పేల్చారు.

Samayam Telugu 2 Apr 2018, 5:20 pm
ఏపీ అసెంబ్లీ లాబీలో సరదా చర్చ జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, మంత్రి కళా వెంకట్రావుకు మాజీ మంత్రి మాణిక్యాలరావు ఎదురుపడ్డారట. కొత్త శత్రువులకు నమస్కారమంటూ వెంకట్రావు మాణిక్యాలరావును పలకరించారట. పక్కనే ఉన్న రాజకుమారి అడ్వాన్స్‌గా కంగ్రాట్స్ అంటూ అభినందనలు తెలిపారట. కంగ్రాట్స్ ఎందుకని అనుకుంటున్నారా... మాణిక్యాలరావు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. అందుకేనట. దీనిపై ఆయన కూడా స్పందించారు.
Samayam Telugu Somu


తాను అధ్యక్షుడ్ని కావడం లేదని మాణిక్యాలరావు నన్నపనేనితో అన్నారట. సోము వీర్రాజు అవుతారని... ఆయన పేరును తానే ప్రతిపాదించినట్లు చెప్పారట. కాదు, కాదు మీరే అవుతారని రాజకుమారి అంటే... టీడీపీకి వీర్రాజు అయితేనే సరిపోతాడంటూ అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోయారట. ఈ సంభాషణతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరనేది క్లారిటీ లేకుండా పోయింది. మాణిక్యాలరావు తాను కాదు... వీర్రాజు అని చెప్పి పెద్ద బాంబే పేల్చారు. మరి అధిష్టానం ఎవరు వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తిగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.