యాప్నగరం

నంద్యాల టీడీపీ అభ్యర్ధిగా... ఆయన?

నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

TNN 17 Mar 2017, 9:26 am
నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో నంద్యాల నియోజవర్గానికి ఆరునెలల్లోపు ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కాగా వైకాపా కూడా ఆ స్థానం తమదేనని, భూమా తమ పార్టీ తరుపునే గెలిచాడు కాబట్టి... అక్కడ తాము మళ్లీ పోటీ చేస్తామని చెప్పింది. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ప్రస్తుతం టీడీపీ తరుపున ఎవరిని నిల్చోబెడతారనేదే ఆసక్తిగా మారింది. మొన్నటి వరకు భూమా చిన్న కూతురు మౌనిక పేరు వినబడింది. ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది.
Samayam Telugu who is tdp candidate in nandyal by election
నంద్యాల టీడీపీ అభ్యర్ధిగా... ఆయన?


భూమా నాగిరెడ్డి సోదరుడు శేఖర్‌రెడ్డి కొడుకైన భూమా బ్రహ్మానందరెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. శోభా నాగిరెడ్డి మరణించాక ఆళ్లగడ్డ ఉపఎన్నికలో ఆయన కాస్త ఆసక్తిని చూపించారు. అయితే ఆ స్థానంలో భూమా పెద్దకూతురు అఖిల ప్రియనే కరెక్ట్ అని అధిష్ఠానం భావించింది. దీంతో బ్రహ్మానందరెడ్డికి అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఖాళీ అయిన నంద్యాల నుంచి పోటీకి మళ్లీ బ్రహ్మానంద రెడ్డి ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ఆయన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అల్లుడు కూడా. కనుక అల్లుడికి అవకాశమిస్తే... రామిరెడ్డి కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుందని టీడీపీ ఆలోచన. ప్రస్తుతం బ్రహ్మానందరెడ్డి ఆళ్లగడ్డలో జగత్ డెయిరీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. టీడీపీ మౌనికను ఎంపిక చేస్తుందో లేక బ్రహ్మానందరెడ్డిని ఎంపిక చేస్తుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.