యాప్నగరం

ఇష్టంలేని పెళ్లి.. భర్త గొంతుకోసిన భార్య!

తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని ఓ మహిళ కట్టుకున్న భర్తనే హత్యచేయడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

Samayam Telugu 29 May 2018, 12:54 am
విజయనగరంలో ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన నవ వధువు ఘటన మరువకముందే.. శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని ఓ మహిళ కట్టుకున్న భర్తనే హత్యచేయడానికి ప్రయత్నించింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాకు చెందిన బుడ్డా నవీన్‌కుమార్‌, నీలిమకు మే 9న వివాహం జరిగింది. ఈ క్రమంలో సోమవారం (మే 28) నవీన్‌ తన అత్తగారిల్లైన గదలాం నుంచి భార్య నీలిమతో కలిసి బైక్‌పై తన ఇంటికి వస్తున్నాడు.
Samayam Telugu murder


బైక్ కోటబొమ్మాళి రైల్వే నిలయం దగ్గరకు రాగానే వెనక వైపు కూర్చున్న నీలిమ భర్తను హతమార్చేందుకు మెడపై కత్తితో దాడి చేసి.. అక్కడి నుంచి పారిపోయింది. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న నవీన్‌ను స్థానికులు గుర్తించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. హత్యాయత్నం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.