యాప్నగరం

దుబాయ్ వెళ్లి డబ్బులు పంపిస్తే.. భార్య వేరే వ్యక్తితో; ప్రతీకారం కోసం భర్త..

దుబాయ్ వెళ్లి కష్టపడి సంపాదించి.. ఆ మొత్తాన్ని భార్యకు పంపిస్తే.. ఆమె మాత్రం అతణ్ని మోసం చేసింది. డబ్బు తీసుకొని ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇండియా తిరిగొచ్చిన ఆ భర్త నక్సలైట్‌గా మారాడు.

Samayam Telugu 16 Oct 2018, 11:56 am
బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ యువకుడు భవన నిర్మాణ కార్మికుడిగా కష్టపడి పని చేశాడు. అక్కడ పైసా పైసా కూడబెట్టి ఇక్కడున్న భార్యకు పంపాడు. ఆవిడేమో మరో వ్యక్తి మోజులో పడి.. డబ్బు తీసుకొని అతడితో వెళ్లిపోయింది. భార్య తనను మోసం చేసిందనే విషయం తెలుసుకున్న భర్త.. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇండియా తిరిగొచ్చాడు. నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. సినిమా కథను తలపిస్తోన్న ఈ ఘటన జరిగింది మన తెలంగాణలోనే. వివరాల్లోకి వెళ్తే..
Samayam Telugu jakkula babu


రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్న లిగ్నాపూర్ గ్రామానికి జక్కుల బాబు (38) బతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. శ్రమించి డబ్బును పంపిస్తే.. భార్య మరో వ్యక్తి వెళ్లిపోయింది. దీంతో 2016లో ఇండియా చేరుకున్న బాబు.. నిషేధిత సీపీఐఎంఎల్ జనశక్తి పార్టీలో చేరాడని సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.

‘ఉద్యమంలోకి కొత్త వారిని చేర్చుకోవడం, కాంట్రాక్టర్లను బెదిరించడం లాంటి పనులకు బాబు పాల్పడ్డాడు. దీంతో 2017లో అతడిపై కేసు నమోదైంది. అక్టోబర్ 6న బాబును, అతడి అనుచరుడైన తోకల శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశామ’ని ఎస్పీ తెలిపారు. బాబు జనశక్తి గ్రూప్‌లో జిల్లా కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. అతడి దగ్గరి నుంచి అమెరికాలో తయారైన పిస్టల్, 15 రౌండ్ల బుల్లెట్లు, రూ.44,600 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Read this story in English

బాబుపై 2011 నుంచి తంగలపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. అతడిపై ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఓ కేసు, నిజామాబాద్‌లో మరో కేసు పెండింగ్‌లో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.