యాప్నగరం

ప్రేమించి పెళ్లాడింది.. పట్టించుకోవడం లేదని కడతేర్చింది

తన వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన నాగర్ కర్నూల్ ఇల్లాలు గురించి తెలిసిందే.

TNN 11 Dec 2017, 9:29 am
తన వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన నాగర్ కర్నూల్ ఇల్లాలు గురించి తెలిసిందే. భర్తను చంపేయడమే కాకుండా ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి.. తన భర్త స్థానంలోకి తీసుకురావాలని పన్నాగం పన్నింగి. కానీ ఈ నిజ నాటకంలో ఆమె అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలైంది. రెండు తెలంగాణలో కలకలం రేపిన ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టిన పోలీసులు ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అదనపు ఎస్పీ జోగుల చెన్నయ్య ఆధ్వర్యంలో నిందితురాలిని పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ప్రియుడు కోలుకున్న తరవాత అరెస్టు చేసి విచారిస్తామన్నారు.
Samayam Telugu wife killed her husband with the help of lover in nagar kurnool
ప్రేమించి పెళ్లాడింది.. పట్టించుకోవడం లేదని కడతేర్చింది


ప్రేమించి పెళ్లిచేసుకుని..
తెలకపల్లి మండలం బండపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి, తెలకపల్లికి చెందిన స్వాతిలది ప్రేమ వివాహం. ఏడేళ్ల క్రితం పెళ్లిచేసుకుని అన్యోన్యంగా బతికారు. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల పాప ఉన్నారు. కొన్నాళ్లు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసిన సుధాకర్‌రెడ్డి.. మూడేళ్ల క్రితం నాగర్ కర్నూల్ వచ్చి స్థిరపడ్డారు. క్రషర్ వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. వ్యాపారంలో తలమునకలైన సుధాకర్‌రెడ్డి ఇంటి వద్ద ఉండేది తక్కువే. ఎప్పుడో పొద్దున్ననగా వెళ్లి రాత్రికి వస్తారు. కొన్నిసార్లు వ్యాపారం పనిమీద వేరే ఊరు వెళ్తే తిరిగి రావడానికి రెండు మూడు రోజులు పట్టేది. దీంతో భర్త తనను పట్టించుకోవడంలేదనే భావను స్వాతి వచ్చేసింది. అసంతృప్తితో అడ్డదారి తొక్కింది.

ఫిజియోథెరపీ కోసం వెళ్లి..
నడుము నొప్పితో బాధపడుతున్న స్వాతి రెండేళ్ల క్రితం నాగర్ కర్నూల్‌లోనే రాజేశ్ అనే ఫిజియోథెరపిస్టు దగ్గరికి వెళ్లింది. అప్పటికే భర్తపై అసంతృప్తితో ఉన్న స్వాతి.. రాజేశ్‌కు చేరువైంది. అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. సుధాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో రాజేశ్ తరచూ స్వాతి వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో వీరి సంబంధం గురించి సుధాకర్‌రెడ్డికి తెలిసిపోయింది. గొడవ కూడా జరిగింది. దీంతో ఎలాగైనా భర్త అడ్డుతొలగించుకోవాలని అనుకుంది. అవకాశం కోసం వేచి చూసి నిందితులిద్దరూ గత నెల 27 తెల్లవారుజామున సుధాకర్‌రెడ్డిని హతమార్చి.. అతని కారులోనే మహబూబ్‌నగర్‌కు సమీపంలోని ఫతేపూర్‌ మైసమ్మ ఆలయ సమీంపలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి కాల్చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.