యాప్నగరం

అడ్డొస్తాడని.. భర్త గొంతు కోసేసింది..!

అక్రమ సంబంధానికి అడ్డువస్తాడనే అనుమానంతో ఓ భార్య వేములవాడ రాజన్న ఆలయ సరిసరాల్లోనే భర్త గొంతు కోసి హత్య

TNN 11 Jan 2018, 7:23 am
అక్రమ సంబంధానికి అడ్డువస్తాడనే అనుమానంతో ఓ భార్య వేములవాడ రాజన్న ఆలయ సరిసరాల్లోనే భర్త గొంతు కోసి హత్య చేసింది. సిద్దిపేట జిల్లా నంగనూర్ మండలం ఘనపూర్‌ గ్రామానికి చెందిన బి.బాలయ్య గల్ఫ్‌కి ఉపాధి కోసం వెళ్లి అక్కడ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భర్త దూరంగా ఉండటంతో అతని భార్య నర్సవ్య అదే గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని ఊర్లోని కొంత మంది వ్యక్తులు ఫోన్ ద్వారా బాలయ్యకి చెప్పడంతో ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
Samayam Telugu wife kills gulf returned man at vemulawada temple
అడ్డొస్తాడని.. భర్త గొంతు కోసేసింది..!


తాను ఎంత చెప్పినా.. భార్య తీరు మారకపోవడంతో గల్ఫ్ నుంచి ఇటీవలే బాలయ్య స్వగ్రామానికి వచ్చేశాడు. భార్య తీరుని గమనించి.. ఇక గల్ఫ్‌కి వెళ్లకూడదని నిశ్చయించుకుని అదే విషయాన్ని ఆమెతో చెప్పాడు. భర్త ఇంటి దగ్గరే ఉండిపోతే.. తన అక్రమ సంబంధం కొనసాగించడం కష్టమని భావించిన నర్సవ్య అతడ్ని హతమార్చేందుకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఆదివారం రాజన్న దర్శనానికి తీసుకొచ్చింది. అర్ధరాత్రి మద్యం తాగి బాలయ్య నిద్రిస్తుండగా.. ప్లాన్ ప్రకారం తాను వెంట తెచ్చుకున్న కత్తితో అతని మెడ కోసి చంపేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నర్సవ్వని బుధవారం అరెస్టు చేసినట్లు వేములవాడ డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.